తమిళ హీరో విజయ్ కి సెంటిమెంటు బాగా పట్టేసింది. అందుకే, తన తదుపరి చిత్రానికి కూడా సమంతాని కథానాయికగా తీసుకోమని రికమెండ్ చేశాడు. ఇటీవల ఈ ముద్దుగుమ్మతో కలసి తను చేసిన 'కత్తి' చిత్రం సూపర్ హిట్టయిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో 'రాజా రాణి' ఫేం అట్లీ కుమార్ దర్శకత్వంలో ఈ హీరో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి మొదట్లో నయనతారను అనుకున్నారు. అయితే, ఆమె డేట్స్ క్లాష్ వస్తుండడంతో ఆమె 'సారీ' చెప్పి ప్రాజక్టు నుంచి తప్పుకుంది. దీంతో మరో మాట లేకుండా సమంతాని విజయ్ సిఫార్సు చేశాడని కోలీవుడ్ టాక్. ఆమె కూడా వెంటనే ఓకే చెప్పేసిందట. ఇందులో మరో కథానాయికగా ఎమీ జాక్సన్ నటిస్తోంది.
samantha, vijay, tamilmovie, news, kollywood,