క్షణం సినిమాతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్న నటుడు అడివి శేష్ త్వరలో కొత్త చిత్రాన్ని ప్రారంభించబోతున్నాడు. ఏ చిత్రాన్ని శేష్ అన్నయ్య అడివి సాయి కిరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. సాయి కిరణ్ గతంలో కేరింత, వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు వంటి సినిమాల్ని డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రం రొమాంటిక్ లవ్ డ్రామాగా ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అనే దానిపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.
ఈ చర్చల అనంతరం అడివి శేష్ పక్కన పార్వతి నాయర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందని, అటు గ్లామర్ ఇటు పెర్ఫార్మెన్స్ కి బ్యాలెన్డ్ గా ఉంటుందని నిర్ణయించుకుని ఆమెను ఫైనల్ చేశారట. ఈమె గతంలో పలు మళయాళ, తమిళ చిత్రాల్లో నటించింది. పార్వతి నాయర్ కూడా ఈ ప్రాజెక్ట్ కథ విని నచ్చడంతో ఓకే చెప్పిందని, త్వరలోనే సినిమా మొదలుతుందని తెలుస్తోంది. ఇకపోతే శేష్ శశి కిరణ్, రాహుల్ పాకల డైరెక్షన్లో ?గూఢచారి? చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.