అక్కినేని అఖిల్ మొదటి కథానాయిక కన్ఫర్మ్ అయింది. వీవీ వినాయక్ దర్శకత్వంలో అఖిల్ తన డెబ్యూ మూవీని చేస్తున్న సంగతి విదితమే. యంగ్ హీరో నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా సాయేశా సైగల్ ఎంపికైంది. ఈ విషయాన్ని అఖిల్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కు సాయేశా మనవరాలవుతుంది. ఆమెకు కూడా ఇది తొలి సినిమా అనీ, అందుకే తనలాగే ఆమె కూడా నెర్వస్ ఫీలవుతోందనీ అఖిల్ అంటున్నాడు. ఈ నెల 14న హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.
akhil, vvvinayak, nithin, news, tollywood, saayesha,