Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jun-2016 11:13:09
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజినీకాంత్ - దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రోబో చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. 2.0 టైటిల్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. విలన్ గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న విషయం కూడా పాత సంగతే. కానీ.. అసలీ సినిమాలో నటించేందుకు అక్షయ్ ఛార్జ్ చేసిన మొత్తం గురించి ఓ విషయం తెలిసి.. అందరూ నోరెళ్లబెడుతున్నారు.

సౌతిండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ రజినీకాంత్. రోబో మాదిరిగా ఎక్కువ షెడ్యూల్స్ టైం తీసుకునే సినిమాలకు ఈ మొత్తం మరింతగా పెరుగుతుంది. అయితే.. రోబో సృష్టించిన సంచలనాలను దృష్టిలో ఉంచుకుని రెండో భాగం కోసం మరింత జాగ్రత్తగా ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. అందుకే విలన్ గా నటించాలంటూ ముందు హృతిక్ రోషన్.. సల్మాన్ ఖాన్ లను సంప్రదించారు. కానీ వీరితో చర్చలు ఎంతకూ ఓ కొలిక్కి రాలేదు.

షూటింగ్ షెడ్యూల్స్ కి టైం దగ్గర పడ్డంతో చివరగా అక్షయ్ ను సంప్రదించగా.. ఈ రోల్ లో చేసేందుక ఈ కిలాడీ పెద్ద మొత్తాన్నే అడిగాడట. అది రజినీకాంత్ కు చెల్లించే మొత్తం కంటే ఎక్కువ అయినా.. మూవీకి బాలీవుడ్ లో క్రేజ్ తీసుకురావాలంటే మరో స్టార్ హీరో తప్పనిసరి అని భావించడంతో.. అంత మొత్తాన్ని ఇచ్చుకుని మరీ ఒప్పించారని తెలుస్తోంది. ఏమైనా ఓ సినిమాలో హీరో కంటే విలన్ ఎక్కువగా.. అందులోను రజినీకాంత్ కంటే ఎక్కువగా చెల్లించడం అంటే.. అది పెద్ద రికార్డే అని చెప్పాలి.

,  ,  ,  ,  ,