తాజాగా 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంతో మరో విజయాన్ని తన అకౌంటులో వేసుకున్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం విషయంలో దర్శకుడు బోయపాటి శ్రీనుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. గత కొంతకాలంగా ఈ ప్రాజక్టుపై చర్చలు జరుగుతున్నా, బన్నీ సైడు నుంచి ఇంతవరకు ప్రకటన రాలేదు. దానికి తోడు ఇటీవల దీని గురించి బన్నీని అడిగినప్పుడు, దీనిని ఇదమిత్థంగా తేల్చి చెప్పకపోవడంతో, అసలు ఈ ప్రాజక్టు ఉంటుందా? ఉండదా? అన్న సందేహాలు కూడా చాలా మందిలో కలిగాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా స్క్రిప్టుకు తాజాగా బన్నీ పచ్చజెండా ఊపాడని సమాచారం. దీనికి తమన్ సంగీతాన్ని అందిస్తాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, వారిలో ఒకరిగా 'మిస్టర్ ఎక్స్' హిందీ సినిమాలో కథానాయికగా నటించిన అమీరా దస్తూర్ ని ఎంచుకున్నారని చెబుతున్నారు. మరో కథానాయిక ఎంపిక జరుగుతోంది.
alluarjun, boyapati, geetaarts, tollywood, news, ameeradasturi,