అల్లు అర్జున్ పూర్తిగా తన దృష్టంతా రాబోతున్న సినిమా దువ్వాడ జగన్నాధం పై పెట్టినట్లు ఉంది. వరస హిట్లతో భారీ అంచనాలు మధ్య వస్తున్న సినిమా ఇది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వేసవి కాలం రేసు నుండి వర్షాకాలంకు వెళ్ళిన సంగతి తెలిసిందే.
బన్నీ ఇప్పుడు దువ్వాడ జగన్నాధం క్లైమాక్స్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ పతాక సన్నివేశాలు ఈ నెల ఆఖరికి పూర్తి చేస్తారంట. వెనువెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టే పనిలో ఉన్నారు. అయితే సాయంత్రం పూట ఈ సినిమా డబ్బింగ్ కూడా ఒక పక్కన మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జూన్ 23న విడుదలకి సిద్దం చేస్తాం అని చెప్పారు కాని.. బన్నీ మాత్రం తొందరపడి క్వాలిటి లేకుండా తీసి ఒకే చేస్తే మళ్ళీ మొదటికే మోసం వస్తుందని ఫీలై.. డబ్బింగ్ ఫినిష్ చేసి.. ఫస్ట్ కాపీ చూసుకుని..కావాలంటే ఏమన్నా మారుస్తారట. అది సంగతి.
ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మాతగా హరీష్ డైరక్షన్లో దేవి శ్రీ మ్యూజిక్ ఇస్తున్న అల్లు అర్జున్ యాక్షన్ డ్రామా ఇది.