నందమూరి నటసింహం బాలకృష్ణ తృటిలో ఓ రోడ్డు ప్రమాదం బారి నుంచి తప్పించుకున్నారు. హిందూపూర్ ప్రాంతానికి ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ, ఈ ఉదయం నియోజక వర్గంలోని కొన్ని పనులను చూసుకొని, తన అనుచరులతో బెంగళూరు ప్రయాణమయ్యారు. ఇక బెంగళూరు ప్రయాణంలోనే ఆయన ప్రయాణిస్తోన్న వాహనం డివైడర్ను ఢీకొంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో బాలకృష్ణ సహా ఆయన అనుచరులంతా క్షేమంగా బయటపడ్డారు.
భాగేపల్లి ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అభిమానులు కంగారు పడ్డారు. అయితే కారు ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి అందరూ క్షేమమన్న వార్త రాగానే ఊపిరి పీల్చుకున్నారు. నియోజకవర్గం పనుల మీదే ఆయన బెంగళూరు వెళుతున్నట్లు తెలుస్తోంది.