Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Sep-2017 10:20:18
facebook Twitter Googleplus
Photo

హీరో క్యారెక్టర్ ని హై లెవెల్ చూపించే ఒకే ఒక్క దర్శకుడు పూరి జగన్నాథ్. ఒకప్పుడు కేవలం తను రాసిన డైలాగులతోనే సినిమాకి భారీ స్థాయిలో కలెక్షన్స్ ని రప్పించేవారు. యువ హీరోలు ఆయనతో సినిమా చెయ్యడానికి చాలా ఇష్టపడేవారు. కానీ ప్రస్తుతం మనోడి లక్ ఏ మాత్రం బాలేదు. చేసిన సినిమాలన్నీ వరుస పరాజయాలను అందుకుంటున్నాయి. ఎంతమంది హీరోలు మారినా పురిజగన్నాథ్ కి మాత్రం విజయం దక్కడం లేదు.

రీసెంట్ గా సీనియర్ హీరో బాలయ్య తో తీసిన పైసా వసూల్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. అందుకే పూరి ప్రస్తుతం తన కొడుకు ఆకాష్ తో ఓ సినిమాను చేసేందుకు పూర్తి సన్నహకలు చేసుకుంటున్నాడు. రీసెంట్ గా ఛార్మితో కలిసి కొందరి నటి నటులని కూడా ఫైనల్ చేశారు. అయితే పైసా వసూల్ ఎఫెక్ట్ ఆకాష్ సినిమా మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది. దీంతో పూరి హిట్ ట్రాక్ లో పడ్డ తర్వాత ఆకాష్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. అయితే బాలయ్య తో మరో సినిమా కూడా చేస్తాను అని పూరి ఇంతకుముందు చెప్పిన విషయం తెలిసిందే. అదే విధంగా బాలయ్య కూడా పూరితో సినిమా చేస్తాను అని చెప్పారు. కానీ ఇప్పుడు బాలయ్య నిర్ణయం మార్చుకున్నారు అనే కామెంట్స్ వినబడుతున్నాయి.

ఎందుకంటే బాలయ్య పైసా వసూల్ కి అభిమానులు చాలా నిరాశ చెందారట. దీంతో అభిమానులు ఏ మాత్రం పూరితో కలవవద్దని చెబుతున్నారట. అలాగే అతని గురువు అయిన అర్జీవి తో కూడా వెళ్లవద్దని ముందుగానే చెబుతున్నారట.

,  ,  ,  ,  ,