తాజాగా 'ముకుంద' సినిమా ద్వారా ప్రేక్షకులను మురిపించిన అందాలతార పూజా హెగ్డే త్వరలో అల్లు అర్జున్ సరసన నటించనుంది. కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. దీనికి సంబంధించిన స్టోరీ లైన్ కూడా ఇప్పటికే ఓకే అయింది. కాగా, ఇందులో కథానాయికగా పూజా హెగ్డేను ఎంచుకున్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేస్తుండగా ... మహేష్ బాబుతో కొరటాల శివ ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాలు పూర్తయ్యాక బన్నీ-కొరటాల ప్రాజక్టు పట్టాలెక్కుతుంది.
alluarjun, koratalashiva, newmovie, tollywood, news, poojahegde,