యువ దర్శకుడు చందు మొండేటికి అక్కినేని నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల వచ్చిన 'కార్తికేయ' హిట్ చిత్రంతో చందు దర్శకుడిగా పరిచయమైన సంగతి విదితమే. ఈ దర్శకుడు చెప్పిన కథ చైతూకి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. దాంతో చందు ప్రస్తుతం స్క్రిప్టు పని మొదలుపెట్టాడట. మరోపక్క ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో చైతన్య చాలా తెలివిగా తన చిత్రాలను ఎంచుకుంటున్నాడు. హిట్ చిత్రాల దర్శకులను పట్టుకుని, వారితో తన చిత్రాలను ప్లాన్ చేసుకుంటున్నాడు.
chandu, nagachaitanya, news, tollywood,