బ్రూస్లీ పరాజయం తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకొని రామ్ చరణ్ తన కొత్త సినిమాను ఈమధ్యే సెట్స్పైకి తీసుకెళ్ళిన విషయం తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన తని ఒరువన్కి రీమేక్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఈ నెలాఖర్లో కశ్మీర్లో కొద్దిరోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది. హైద్రాబాద్లో షెడ్యూల్ పూర్తైన వెంటనే కశ్మీర్లో ఈ చిన్న షెడ్యూల్ మొదలవుతుంది.
ఇక ఈ కశ్మీర్ షెడ్యూల్ తర్వాత హైద్రాబాద్లోనే మే నెల మొత్తం షూటింగ్ జరగనుంది. మే నెలాఖరు కల్లా 90%పైనే షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్గా నటిస్తున్నారు. మైండ్ గేమ్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో నాటితరం హీరో అరవింద్ స్వామి విలన్గా నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు.