పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చార్మీ కథానాయికగా 'జ్యోతిలక్ష్మి' పేరిట ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన స్క్రిప్టు ఇప్పటికే రెడీ అయింది. కాగా ఈ చిత్రం షూటింగును ఈ నెల 20 నుంచి హైదరాబాదులో నిర్వహిస్తారు. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ దీనిని నిర్మించనున్నారు. ఒకప్పుడు ఐటెం గాళ్ గా ఎనలేని పేరు తెచ్చుకున్న జ్యోతిలక్ష్మి పేరుతో ఈ సినిమా వస్తుండడంతో అంతటా క్యూరియాజిటీ నెలకొంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రానికి చార్మీ సమర్పకురాలిగా వ్యవహరిస్తూ, చిత్ర నిర్మాణంలో కూడా పాలుపంచుకుంటోందట.
purijagannadh, charmi, tollywood, jyothilaxmi,