వంటగాళ్లు ఎక్కువైతే పాకం చెడిపోతుందని సామెత. ఇప్పుడు చిరంజీవి 150 సినిమా పరిస్థితి కూడా ఇలానే అవుతుందేమో అన్న టెన్షన్ పట్టుకుంది. 150వ సినిమా కధ కోసం చాలా అన్వేషణే చేశారు చిరు. దొరకలేదు. చివరికి తమిళ సినిమా ?కత్తి? రీమేక్ హక్కులను కొనుక్కొని సెట్స్ పైకి వెళ్లారు. అయితే ఈ సినిమా కథ విషయంలో ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు ఆసక్తికరంగా వున్నాయి.
ఇది ఆల్రెడీ చూసేసిన కథ కాబట్టి వంటకం ఇబ్బంది ఉండదు. సీన్లను మన నేటివిటీకి తగ్గట్టు మార్చుకొంటె సరిపోతుంది. ఈ పని ముగ్గురు చేశారు. పరుచూరి బ్రదర్స్ , ఆకుల శివ, అలాగే వినాయక్. బౌండెడ్ స్క్రిప్ట్ లాక్ అయింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది.
అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏమిటంటే.. ఈ సినిమాలో మరో రైటర్ చేయి పడిందట. ఆయనే.. బుర్రా సాయిమాధవ్. ఈ సినిమా కోసం కొత్తగా కొన్ని ఎమోషన్ సీన్లు రాయమని సాయిమాధవ్ పురమాయించడం, ఆయన కూడా కొన్ని సీన్లు రాయడం జరిగిందనే గాసిప్ వినిపిస్తోంది.
ఈ పరిణామం కాస్త వింతగానే వుంది. ఆల్రెడీ తెలిసిన కథ. కొనుక్కున్న కథ. తెలుగు స్క్రిప్ట్ పై(అనువాదం) ముగ్గురు పని చేశారు. స్క్రిప్ట్ లాక్ అయింది. అలంటాటప్పుడు మళ్ళీ కొత్తగా సీన్లు రాయడం ఏమిటో అర్ధం కాదు.
కొంపదీసి కథను కిచిడి చేస్తున్నారా ? ఇలా అయితే ఒరిజినల్ కథలోని ఫీల్ పాడయ్యే ప్రమాదం వుంది.