తెలుగు పరిశ్రమ మొత్తం ఏంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ?చిరంజీవి? 150వ చిత్రం. తమిళనాట భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విజయ్ నటించిన ?కత్తి? కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. చిరంజీవి సినిమా తీసి దాదాపు 9 ఏళ్ళు కావొస్తోంది. అయినా ఆయన క్రేజ్ తగ్గలేదు. ఆయన నటిస్తున్న ఈ 150వ చిత్రం బిజినెస్ ఓ రేంజులో జరుగుతోందని తెలుస్తోంది.
ఇప్పటికే సినిమా తాలూకు థియేట్రికల్ రైట్స్ ను కోట్లు పెట్టి కొంటున్నారట. ముఖ్యంగా సీడెడ్ రైట్స్ ను చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడైన ?ఎన్ వి ప్రసాద్? ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారని, అలాగే ఈస్ట్ గోదావరి డీల్ కూడా ఓకే అయిందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం వైజాగ్ రైట్స్ కోసం పోటీ జరుగుతోందట, పలువురు ఈ రైట్స్ కోసం భారీ మొత్తాన్ని చెల్లించేందుకు రెడీగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకొన్నిరోజులు గడిస్తేగాని ఈ బిజినెస్ కు సంబందించిన మొత్తం వివరాలు బయటకు రావు. ఈ చిత్రాన్ని ?రామ్ చరణ్ తేజ్? స్వయంగా నిర్మిస్తుండగా ?వివి వినాయక్? దర్శకత్వ భాద్యతలు నిర్వహిస్తున్నారు.