మెగాస్టార్ చిరంజీవి బుల్లితెర ఎంట్రీ ఇస్తున్న విషయం ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ చేసేశారు. మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 4కు చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. అయితే.. మెగాస్టార్ ఎంఈకే తొలిఎపిసోడ్ కి గెస్ట్ ఎవరు అనే సందేహం బయల్దేరింది.
ఇప్పుడీ అంశానికి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ డీటైల్స్ తెలియవచ్చింది. మీలో ఎవరు కోటీశ్వరుడు4 మొదటి ఎపిసోడ్ కి.. తొలి మూడు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున హాజరు కానున్నారట. తన బాధ్యతను చిరంజీవికి అప్పగించేలా ఈ ఎపిసోడ్ డిజైన్ చేశారని తెలుస్తోంది. ఇంకా ఈ ఎపిసోడ్ చిత్రీకరణ జరగలేదు. అయితే.. త్వరలోనే ఈ ఫస్ట్ ఎపిసోడ్ పిక్చరైజేషన్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఖైదీ నెంబర్ 150ని కంప్లీట్ చేయడంలో చిరంజీవి.. ఓం నమో వెంకటేశాయను పూర్తి చేసే పనిలో నాగార్జున బిజీబిజీగా ఉన్నారు. వీరిద్దరికి ఉమ్మడిగా డేట్స్ సర్దుబాటు కాగానే.. మీలో ఎవరు కోటీశ్వరుడు ఎపిసోడ్ పిక్చరైజే చేయనున్నారు. చిరు-నాగ్ ల కాంబినేషన్ లో వచ్చే ఈ ఎపిసోడ్.. తెలుగు టీవీ చరిత్రలో టీఆర్పీలను బద్దలు కొట్టేస్తుందనే అంచనాలు ఉన్నాయి.