పవన్ కళ్యాణ్.. ఇప్పడు అజ్జాతవాసితో వస్తున్నాడు. అయితే ఆయన తన రాజకీయ పర్యటనలో భాగంగా మాట్లాడుతూ.. నేను సినిమాలన్నీ మానుకుని ఇక్కడకు వస్తున్నానంటూ పదేపదే సూటిగా చెప్పారు. అదంతా బాగానే ఉంది కాని.. అసలు అజ్ఞాతవాసి ఆయన ఆఖరి సినిమా అనుకుంటున్న టైములో ఇప్పుడు మాత్రం కొన్ని ప్రామిస్సుల గురించి తెగ డిస్కషన్లు వినిపిస్తున్నాయి.
నిన్న ఒక ఇంటర్యూలో అగ్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఇచ్చిన కమిట్మెంట్లతో సంబంధం లేకుండా పవన్ కల్యాణ్ తనతో ఒక సినిమాను చేస్తానన్నాడని తెలిపాడు. అయితే ఈ మాట ఎప్పుడో ఇచ్చింది అయినా కూడా.. ఇప్పుడు రాజు గారు 'రాజకీయాలతో సంబంధం లేకుండా' అంటూ స్ర్టెస్ చేయడం కాస్త విడ్డూరంగా ఉంది. మరి నిజంగానే పవన్ ఈ ప్రామిస్ ను నిలబెట్టుకుంటాడా? అలా అయితే మొన్న రాజకీయ టూర్ లో ఆయన అజ్ఞాతవాసి ఆఖరి సినిమా అంటూ చెప్పడం వట్టి మాటేనా?? పవన్ చేసిన ప్రామిస్సుల వలన ఇటువంటి కొత్త సందేహాలు పుట్టేస్తున్నాయి.
ఇకపోతే గతంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు చాలామంది నిర్మాతలకు ఇచ్చారు. దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావుతో సినిమా చేస్తానన్నారు. అలాగే ఏం.ఎం.రత్నం నుండి ఇంకా చాలామంది నిర్మాతలు పవన్ సినిమా చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు