సినీ రంగంలో ఉన్న వాళ్లకు సినిమా తప్ప మరొక ఆలోచన ఉండదు. అందులోనూ దిల్ రాజు లాంటి బిజీ ప్రొడ్యూసర్ అంటే ఈట్ సినిమా.. డ్రింక్ సినిమా.. స్లీప్ సినిమా అన్నమాటే. అలాంటి వ్యక్తి ఇటీవల తన భార్య మరణంతో విషాదాన్ని అనుభవించారు. రెండు వారాల పాటు సినిమా వ్యవహారాలకు దూరంగా ఇంటిపట్టునే ఉండిపోయారు. ఐతే ఆ విషాద సమయంలో కూడా తాను అనుభవించిన వేదన నుంచి ఓ స్టోరీ ఐడియా పుట్టిందని ఆయన చెప్పడం గమనార్హం.
నా భర్య చనిపోయాక నేను పదమూడు రోజు లు ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. ఆ సమయంలో ఇదే ఇదే జీవితం.. సుఖః దుఃఖాల సంగమం పాట వింటూ గడిపాను. అప్పుడనిపించింది.. రచయితలు ఊరికే రాయరు. జీవిత అనుభవాలనే పాటలుగా రాస్తారని. ఆ థాట్ ప్రాసెస్ లో నాకొక స్టోరీ లైన్ తట్టింది. ఆ స్టోరీతో సినిమా తీయాలనుకుంటున్నా అని రాజు తెలిపాడు.
గత ఐదు నెలల కాలం తన జీవితంలో చిత్రమైన అనుభవాలను.. మిశ్రమానుభూతులను మిగిల్చిందని రాజు తెలిపాడు. జీవితం చాలా విచిత్రమైంది. గడచిన ఐదు నెలల్లో శతమానం భవతి ఒక సంతోషం.. నాకు మనవడు పుట్టడం ఒక సంతోషం.. నేను లోకల్ ఒక సంతోషం.. జీవితం అద్భుతంగా ముందుకు సాగుతోంది అనుకున్నప్పుడు దేవుడు అనుకోని జర్క్ ఇచ్చాడు. ఆ బాధలో ఉండగానే శతమానం భవతి కి నేషనల్ అవార్డు.. దాంతో పాటు నాకు చక్రపాణి-నాగిరెడ్డి అవార్డు దక్కాయి.