మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ?ధృవ? సినిమా కొద్దిరోజులుగా కశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన ?తని ఒరువన్?కు రీమేక్ అయిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక కశ్మీర్ షెడ్యూల్లో ఒక పాటను, కొన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేసిన టీమ్, నిన్నటితో షెడ్యూల్ మొత్తాన్నీ పూర్తి చేసి తిరుగు ప్రయాణమైంది. ఈ షెడ్యూల్ చాలా బాగా వచ్చిందని, రామ్ చరణ్, నవదీప్, శశాంక్ తదితరుల నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు టీమ్ తెలిపింది.
గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తోన్న ఈ సినిమా పక్కా ప్లాన్ ప్రకారం షూట్ జరుపుకుంటూ, ఆగష్టు నెలాఖరుకు పూర్తవుతుందని సమాచారం. సెప్టెంబర్ నెలాఖర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. కార్పొరేట్ లెవెల్లో సాగే నేరాలను ఎదుర్కొనే ఓ పోలీసాఫీసర్ కథగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్గా నటిస్తున్నారు.