మొన్నటివరకు కొల్లేరు పరిసర ప్రాంతాల్లో తన తండ్రి సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరి జిల్లాలో రామ్ చరణ్ తన కొత్త సినిమా కోసం షూటింగ్ చేశాడు. ఎండలు ఎక్కువగా ఉన్నాయనే నెపంతో స్వామి మాలలో ఉన్న ఈ మెగా హీరోకు క్రియేటివ్ దర్శకుడు బ్రేక్ ఇచ్చాడులేండి. పైగా సమంతకు కూడా వేసవి వేడిమి పడకపోవడంతో.. మే నెలను ఎవాయిడ్ చేయడమే బెటర్ అని ఫీలయ్యారు.
ఇకపోతే కొల్లేరు అండ్ పోలవరం ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నన్ని రోజులూ.. తన భార్య ఉపాసనతో కలసి ఆ చుట్టుపక్కల గ్రామాలను చుట్టేస్తూనే ఉన్నాడు రామ్ చరణ్. ఆ సమయంలో అక్కడి అభిమానులు చాలా గిఫ్టులు ఇస్తూనే ఉన్నారు. అయితే భీమవరంలోని కొందరు గాఢాబిమానులు మాత్రం.. ఏకంగా వాళ్ల ప్రాంతంలో పాపులర్ అయిన కోడిపందాలకు గుర్తుగా.. ఒక పందెం పుంజును చెర్రీ చేతిలో పెట్టేశారు. మనోడు ఊరుకుంటాడా.. ఈ కోడిని హైదరాబాద్ తీసుకొచ్చి తన ఫామ్ హౌస్ లో పెట్టుకున్నాడు.
మొన్నామధ్యన ఒక కొత్త గుర్రం పిల్ల.. ఒక దూడ.. ఇప్పుడు ఈ పుంజు.. చరణ్ ఫామ్ హౌసులోకి వస్తున్న ఈ కొత్త కొత్త పెంపుడు జంతువులను పక్షులనూ చూస్తుంటే తనకు తెగ సంతోహం కలుగుతోంది అంటోంది ఉపాసన.