యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ?జనతా గ్యారెజ్? సినిమా ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్. ప్రస్తుతం తెలుగులో సెట్స్పై ఉండి, విడుదలకు సిద్ధంగా ఉన్న క్రేజీ సినిమాల్లో ?జనతా గ్యారెజ్? మొదటి స్థానంలో ఉంది. ఇక ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ పోర్షన్ను పూర్తి చేసే పనిలో ఉంది. ఎన్టీఆర్ పాల్గొంటుండగా హైద్రాబాద్ శివార్లలో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఆ తర్వాత మిగిలిన రెండు పాటలను కూడా ఈ నెల్లోనే పూర్తి చేసేలా టీం ప్లాన్ చేసింది.
ముందే ప్రకటించినట్టు ఆగష్టు 12న సినిమా పక్కాగా థియేటర్ల ముందుకు వచ్చేసేలా టీం పోస్ట్ ప్రొడక్షన్ కూడా సమాంతరంగా పూర్తి చేస్తోంది. ?మిర్చి?, ?శ్రీమంతుడు? సినిమాలతో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ స్టైల్లో మాస్ అంశాలతో నిండిన కమర్షియల్ ఎంటర్టైనర్గా జనతా గ్యారెజ్ ప్రచారం పొందుతోంది.