ఎన్టీఆర్ ? కొరటాల శివ కాంబినేషన్ లో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ?జనతా గ్యారేజ్?. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా భారీ థియేటర్స్ లలో తెలుగు, తమిళం, మలయాళ భాషలలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.
ప్రధానంగా ఈ చిత్రానికి ఆ నలుగురు హైలైట్ అని తెలుస్తుంది. ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే..మొదట ఎన్టీఆర్..టెంపర్ , నాన్నకు ప్రేమతో వంటి వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీద ఉన్న ఎన్టీఆర్ ఈ చిత్రం లో సరికొత్తగా కనిపిస్తుండడం. అలాగే మిర్చి , శ్రీమంతుడు వంటి చిత్రాలతో తన సత్తా ఏంటో చూపించడమే కాదు సోషల్ మెసేజ్ కథ ను కమర్షిల్ చిత్రంగా కూడా తీయచ్చని తెలిపిన కొరటాల శివ.
ఇక మూడో వ్యక్తి మోహన్ లాల్. చాల కాలం తర్వాత మోహన్ లాల్ తెలుగు చిత్రం లో కనిపించడం , అలాగే సొంత డబ్బింగ్ చెప్పడం హైలైట్. మలయాళం లో మోహన్ లాల్ కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు , ఇప్పుడు జనతా లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండడం తో మలయాళం లో ఎన్టీఆర్ కు ప్లస్ కానుంది.
ఇక చివరగా దేవి శ్రీ..ఎన్టీఆర్ కు ఇటు కొరటాల కు వీరిద్దరికి దేవి శ్రీ హిట్ కాంబినేషన్ అని అందరి తెలుసు. తన మ్యాజిక్ మ్యూజిక్ తో జనతా విడుదల కు ముందే సూపర్ హిట్ చేసి తన రాకింగ్ మ్యూజిక్ ఏంటో మరోసారి ప్రేక్షకులకు రుచి చూపించాడు. ఇలా మొత్తం ఈ నలుగురు సినిమాకు నాల్గు పిల్లర్లు గా చెప్పవచ్చు.