ఎన్టీఆర్ ? కొరటాల శివల జనతా గ్యారేజ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. షూటింగ్ దాదాపు పూర్తికావొస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 12న తీసుకురావాలని భావించినా.. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని గ్యారేజ్ రిలీజ్ డేట్ ని సెప్టెంబర్ 2కి వాయిదా వేశారు. రిలీజ్ రోజున రికార్డ్ ఓపెనింగ్స్ సాధించాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే అధిక సంఖ్యలో జనతా గ్యారేజ్ ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
అయితే, గ్యారేజ్ నిర్మాతల ఆశలపై నీళ్లు చల్లే న్యూస్ ఒకటి బయటికొచ్చింది. సెప్టెంబర్ 2న ట్రేడ్ యూనియన్స్తో పాటు లెఫ్ట్ పార్టీలు భారత్ బంద్కి పిలుపునిచ్చాయి. ఈ ప్రభావం జనతా గ్యారేజ్ పై పడనుంది. థియేటర్స్ కూడా ఈ బంద్ లో పాల్గొంటే గ్యారేజ్ కి గట్టి దెబ్బ తగిలినట్టే. మరి..బంద్ దృష్ట్యా ఈ చిత్రాని పోస్ట్ చేసేందుకు చిత్రబృందం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా.. ? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఆగస్టు 12న ఆడియో రిలీజ్ సందర్భంగా మూవీ విడుదల తేదీపై క్లారిటీ రానుంది