యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ?జనతా గ్యారెజ్? సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఒక స్టార్ హీరో సినిమాను సెట్స్పైకి వెళ్ళకముందే విడుదల తేదీతో సహా ప్రకటించిన సినిమా యూనిట్, చెప్పినట్లుగానే ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పక్కాగా సిద్ధమవుతోంది. ?మిర్చి?, ?శ్రీమంతుడు? సినిమాలతో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరిదశకు చేరుకుంది.
ప్రస్తుతం హైద్రాబాద్లో జరుగుతోన్న షెడ్యూల్ ఈ నెలాఖరు వరకూ నిరాటంకంగా జరుగుతుందని, ఈ షెడ్యూల్తో ఒక్క పాట మినహా సినిమా మొత్తం పూర్తవుతుందని సమాచారం. ఇక దీంతో సినిమా ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేయడానికి ఏ ఆటంకాలూ లేవన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్లో సత్తా చాటుతోన్న ఈ సినిమాపై అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.