Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Nov-2017 11:00:14
facebook Twitter Googleplus
Photo

మణిరత్నం దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలనుకునే నటులెందరో ఉంటారు. యాక్టర్ల టాలెంట్ కు పదును పెట్టేలా ఆయన సినిమాలుంటాయి. సాధారణంగా మణిరత్నం తమిళంలోనే సినిమా తీస్తుంటారు. తర్వాత దానిని డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. అందుకే ఆయన సినిమాల్లోని క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మొహాలు తక్కువే ఉంటాయి.

ఈ మధ్య కాలంలో వరస ఫ్లాపులతో సతమతమవుతున్న మణిరత్నం ఈసారి పాత - కొత్త నటుల కలయికతో ఓ సినిమా ప్లాన్ చేశాడు. తమిళ్ స్టార్ హీరో శింబు హీరోగా తీయబోయే సినిమాలో ఓ ప్రధాన పాత్రకు తెలుగు నటి జయసుధను తీసుకుంటున్నారు. జయసుధ భర్త ఆరు నెలల క్రితం మరణించారు. అప్పటి నుంచి కోలుకోలేని విషాదంలో ఉన్న ఆమె కొత్త చిత్రాలేవీ అంగీకరించలేదు. గ్యాప్ తర్వాత ఆమె మొదటగా మణిరత్నం సినిమాలో నటించడానికే అంగీకరించారు. ‘‘సినిమాలో ఇంపార్టెంట్ రోల్ కావడంతో మణిరత్నం స్వయంగా వచ్చి కోరడంతో జయసుధ నటించేందుకు ఒప్పుకున్నారని’’ యూనిట్ సభ్యుడొకరు చెప్పారు.

జయసుధ తెలుగుతో తమిళంలోనూ పలు సినిమాలు చేశారు. మణిరత్నం ఇంతకుముందు డైరెక్ట్ చేసిన సఖి సినిమాలో హీరోయిన్ షాలిని తల్లిగా నటించారు. తాజాగా నాగార్జున - కార్తి కాంబినేషన్ లో వచ్చిన ఊపిరి మూవీతోనూ తమిళ ప్రేక్షకులను పలకరించారు. తిరిగి మణిరత్నం సినిమాతో మరో సారి కోలీవుడ్ లో కనిపించనున్నారు.

,  ,  ,  ,  ,