Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Oct-2016 13:12:29
facebook Twitter Googleplus
Photo

వక్కంతం వంశీ కథతో చేసిన టెంపర్ మినహాయిస్తే.. పూరి జగన్నాథ్ నుంచి ఆయన స్థాయికి తగ్గ సినిమా వచ్చి చాలా కాలమైపోయింది. చివరగా ఆయన్నుంచి వచ్చిన నిఖార్సయిన హిట్టంటే ?దేశముదురు?నే. గత 8-9 సంవత్సరాల్లో పూరి సొంత స్క్రిప్టుతో చేసిన సినిమాలన్నీ చాలా వరకు నిరాశ పరిచాయి. ఆయన రైటింగ్ లో మునుపటి పదును కనిపించట్లేదు. పైగా క్రమంగా ఆయన సినిమాలు ఒక వర్గం ప్రేక్షకులకే పరిమితం అయిపోతున్నాయి. ఐతే ?ఇజం? మాత్రం వాటన్నింటికీ భిన్నమని.. పూరి తనను తాను చాలా మార్చుకుని ఈ సినిమా చేశాడని కాన్ఫిడెంటుగా చెబుతున్నాడు హీరో కళ్యాణ్ రామ్.

ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ??పూరి సినిమాలు ఈ మధ్య ఫ్యామిలీస్ కు దూరమవుతున్న మాట కొంత వరకు నిజమే. కానీ ?ఇజం?లో కొత్త పూరిని చూస్తారు. రొటీన్ డైలాగులు రాయలేదు. ఆయన మనసుపెట్టి ఈ కథ చేుశారు. రఫ్ సీన్లు.. రఫ్ డైలాగులు ఇందులో ఉండవు. అమ్మాయిల మీద సెటైర్లు కూడా వేయలేదు. పైగా మదర్ సెంటిమెంట్ సీన్ కూడా ఉంది. ఆ సీన్ చూస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. తనికెళ్ల భరణితో నా కాంబినేషన్లో వచ్చే సీన్ చూస్తే పూరి మారారు అని ఎవరైనా చెబుతారు అని చెప్పాడు. ఇజం క్లైమాక్సులో తన కెరీర్లో ఎన్నడూ లేని విధంగా పేజీల పేజీల డైలాగులు చెప్పానని.. ఆ సీన్ అద్భుతంగా పండిందని కళ్యాణ్ రామ్ తెలిపాడు.

,  ,  ,  ,  ,