నందమూరి బాలకృష్ణ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆయన వందో చిత్రమైన గౌతమీ పుత్ర శాతకర్ణి విడుదల మరి కొద్ది రోజుల్లోకి వచ్చిన వేళ.. ఈ చిత్రాన్ని ప్రముఖులకు ప్రత్యేకంగా ప్రదర్శించటం కోసం స్పెషల్ షో వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు తనను తప్పనిసరిగా పిలవాలని.. ఈ సినిమాకు క్లాప్ కొట్టిన రోజే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పటం.. తప్పనిసరిగా అని బాలకృష్ణ మాట ఇవ్వటం తెలిసిందే. తాజాగా.. స్పెషల్ షోకు ఇన్విటేషన్లు పంచే హడావుడిలో ఉన్న బాలకృష్ణ కొద్దిసేపటి క్రితం (శుక్రవారం మధ్యాహ్నం) బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు.
ఇకపై తనను ??బసవ తావరక రామ పుత్ర??గా పిలవాలని ఆయన సూచించారు. తనను బాలకృష్ణ పేరుతో కాకుండా కొత్త పేరుతో పిలవాలన్నారు. తమ క్యాన్సర్ ఆసుపత్రి భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని.. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన వంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. బాలయ్య వ్యవహారం చూస్తుంటే.. ?గౌతమీ పుత్ర శాతకర్ణి? ఎఫెక్ట్ కాస్త ఎక్కువగా పడినట్లు కనిపించట్లేదు..?