Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Dec-2017 09:51:51
facebook Twitter Googleplus
Photo

కెరీర్ లో ఎంతో ఉన్నత స్థాయిని చూసిన మహానటి సావత్రి జీవితంలో ఊహించని అనుభవాలు ఉన్నాయి. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ మళ్లీ బయోపిక్ ద్వారా ప్రస్తుత ప్రేక్షకులకు చూపించేందుకు రెడీ అవుతున్నాడు. మహానటి బయోపిక్ లో కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే సమంత - దుల్కర్ సల్మాన్ లతో పాటు మరికొంత మంది నటి నటులు కూడా సినిమాలో ఆ కాలంనాటి నటీనటులుగా కనిపించబోతున్నారు.

ఎవరు ఏ పాత్రలు చేస్తున్నారో ఇప్పటికే మనకు ఓ క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. కానీ సమంత పాత్ర గురించి వచ్చిన న్యూస్ లు మాత్రం అబద్దం అని తేలింది. మొన్నటి వరకు ఆమె సినిమాలో ఒక జర్నలిస్ట్ పాత్రను చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. సావిత్రి జీవితంలోని నిజాల అన్వేషణలో ఆమె సినిమా కథను నడిపిస్తుందని చెప్పారు. కానీ రీసెంట్ గా కీర్తి సురేష్ అసలు విషయాన్ని చెప్పేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమ్మడు సమంత వ్యాఖ్యాతగా సినిమా కథ నడుస్తుందని చెబుతూ.. ఆమె సీనియర్ నటి జామున గారి పాత్రలో కనిపించబోతున్నట్లు చెప్పేసింది.

అయితే కీర్తి కావాలనే చెప్పిందా? లేక అనుకోకుండా చెప్పిందా? అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే ఇన్ని రోజులు దర్శకుడు ఆమె పాత్ర గురించి ఎలాంటి న్యూస్ ని బయటపెట్టలేదు. సమంత కూడా ఎన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్నా మంచి క్యారెక్టర్ అని చెప్పింది గాని అసలు విషయాన్ని బయటపెట్టలేదు.

,  ,  ,  ,  ,  ,