Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Sep-2017 13:28:14
facebook Twitter Googleplus
Photo

రారండోయ్ వేడుక చూద్దాం వంటి వరుస హిట్స్ అందుకున్న నాగ చైతన్య కెరీర్ లో మొదటి సారి హ్యాట్రిక్ కొడదామని అనుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. స్నేహితుడి మీద నమ్మకంతో తీసిన సినిమా ఎవ్వరికి లాభం చేకూర్చలేకపాయింది. కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కించిన యుద్ధం శరణం ఫైనల్ గా అపజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమా కలెక్షన్స్ లో కూడా నిర్మాతకి చాలా దెబ్బ కొట్టింది. యుద్ధం శరణం తో బాక్స్ ఆఫీస్ యుద్ధం పక్కా అనుకున్న చైతు మొదటి రోజే డీలా పడిపోయాడు.

కథలో బలం లేకపోవడంతో నెగిటివ్ రివ్యూస్ అందుకున్న యుద్ధం శరణం నిర్మాత సాయి కొర్రపాటికి తీరని నష్టాన్ని చేకూర్చింది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి కలెక్షన్స్ రాబట్టిన చైతు యుద్ధం శరణంతో కూడా మంచి కలెక్షన్స్ ని అందిస్తాడనుకొని ఆయన మార్కెట్ ను కూడా కూడా లెక్క చేయకుండా నిర్మాత గట్టిగానే ఖర్చు చేశాడట. దీంతో సినిమా అసలు విషయం మొదటి రోజే బయటపడటంతో నిర్మాతకి 11 కోట్ల రూపాయలవరకు నష్టం వచ్చిందని తెలుస్తోంది. ప్రతిసారి నాగార్జున చైతు సినిమాలో పలు జాగ్రత్తలు తీసుకునేవాడు. కానీ ఈ సినిమా విషయంలో నాగ్ ఏ విధంగాను జోక్యం చేసుకోలేదట. ఇక చైతు కూడా దర్శకుడు కృష్ణ మంచి ఫ్రెండ్ అవ్వడంతో తన మాటే నెగ్గించుకొని సినిమాను తీసి కెరీర్ లో మర్చిపోలేని అపజయాన్ని మూటగట్టుకున్నాడు.

ముఖ్యంగా ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి మొదట్లో మంచి సినిమాలను తీసి హిట్ అందుకున్నాడు. కానీ ఈ మధ్య కొన్ని ప్రయోగాలు చేసి అనవసరంగా నష్టాన్ని తెచ్చుకుంటున్నాడు. ఇంతకుముందు తీసిన జ్యో అచ్యుతానంద - పటేల్ సర్ వంటి సినిమాలతో భారీ నష్టాలని చూసిన సాయి కొర్రపాటి ఆ మధ్యలో బాహుబలి విశాఖపట్నం డిస్ట్రిబ్యూషన్ హక్కులతో కొంచెం రికవరీ అయ్యారు.

,  ,  ,  ,  ,