ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'టెంపర్' చిత్రాన్ని చేస్తున్న ఎన్టీఆర్ దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్టుకు కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ నెలలోనే దీని షూటింగ్ లాంఛనంగా మొదలవుతుందని అంటున్నారు. ఇక ఇందులో కథానాయికగా లేటెస్ట్ హీరోయిన్ ను తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. పూజా హెగ్డే కానీ, రాశిఖన్నా కానీ ఆ అవకాశం దక్కించుకోవచ్చని సమాచారం. బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మించే ఈ చిత్రానికి 'యంగ్ స్టర్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట!
ntr, newmovie, sukumar, poojahegde, rasikhanna, tollywood,