పోకిరి .. టైటిల్ తో అనూహ్యమైన విజయాన్ని అందుకున్న పూరీజగన్నాథ్, అదే తరహా టైటిల్ 'లోఫర్' తో మరోమారు యూత్ లో ఆసక్తిని రేకెత్తించడానికి సిద్ధమవుతున్నాడు. వరుణ్ తేజ్ కథానాయకుడు కాగా, కథానాయికగా దిషా పతాని పేరు వినిపిస్తోంది. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 9 నుంచి మొదలయ్యే మొదటి షెడ్యూల్లో మూడురోజుల పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఆ తరువాత ఈ నెల 20 నుంచి 'జోద్ పూర్' లో మొదలయ్యే రెండవ షెడ్యూల్ ఆగస్టు 20 వరకూ కంటిన్యూగా జరుగుతుంది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ .. ఒక సినిమా తరువాత ఒకటిగా పూర్తిచేస్తూ వరుణ్ తేజ్ ముందుకి వెళుతున్నాడు. అలా క్రిష్ దర్శకత్వంలో 'కంచె' సినిమా చేస్తోన్న వరుణ్, ఆ తరువాత ఈ సినిమాపైనే దృష్టిపెట్టనున్నాడు. పూరీ మార్క్ కథ .. టైటిల్ .. టేకింగ్ స్టైల్ .. వరుణ్ కెరియర్ ని ఏ స్థాయిలో స్పీడందుకునేలా చేస్తుందో చూడాలనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది.