Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2017 11:30:36
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు ఏడాదికి పైగా ఎంతో కష్టపడి తీసిన స్పైడర్ సినిమా భారి డిజాస్టర్ అయ్యింది. ఇంతకుముందు బ్రహ్మోత్సవం సినిమాతో అపజయాన్ని అందుకున్న మహేష్ స్పైడర్ తో మళ్లీ ట్రాక్ లోకి వద్దామని చాలా కష్టపడ్డాడు. సినిమా విడుదల వరకు నమ్మకంతోనే ఉన్న మహేష్ ప్రేక్షకులు నిరాశ చెందడంతో తాను కూడా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు.

అంతే కాకుండా భరత్ అనే నేను సినిమా షూటింగ్ ని కూడా పోస్ట్ పోన్ చేసేశాడు. రీసెంట్ గా మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే మహేష్ బాబు ఇంకా తన మనసులో స్పైడర్ ఇచ్చిన రిజల్ట్ గురించి కొంచెం బాధలో ఉన్నాడని టాక్ వినిపించింది. ముఖ్యంగా నిర్మాతకి ఎన్వీ ప్రసాద్ కి భారీ స్థాయిలో నష్టం వచ్చిందని బాదపడ్డ మహేష్ ఒక ప్రామిస్ చేశాడట. స్పైడర్ కోసం ఈ స్టార్ హీరో 23 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుత చిత్రం భారత్ అనే నేను సినిమా పూర్తయిన తర్వాత రిలీజ్ కు ముందు కొంత నష్టాన్ని భర్తీ చేస్తానని మాట ఇచ్చారట.

దీంతో ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో సంచలనంగా మారింది. మహేష్ ఇంతకుముందు కూడా నిర్మాతలకి హెల్ప్ చేశాడు. సినీఫీల్డ్ లో ఇలాంటి హీరోలు చాలా తక్కువే ఉన్నారని చెప్పాలి.

,  ,  ,  ,  ,