సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్స్లో ఒకరైన ఏ.ఆర్.మురుగదాస్తో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈమధ్యే చెన్నైలో సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టిన టీమ్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తోంది. ఇక ఈ సినిమా గురించి ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మహేష్తో కలిసి ఎప్పట్నుంచో పనిచేయాలని అనుకుంటుండగా, ఇప్పటికి అది కుదిరిందని మురుగదాస్ అన్నారు. మహేష్ను ఈ సినిమాలో ఓ కొత్త కోణంలో చూస్తారని, తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో పకడ్బందీగా సినిమాను తెరకెక్కిస్తున్నామని ఈ సందర్భంగా మురుగదాస్ అన్నారు.
ఇక అదేవిధంగా మహేష్ సెట్స్లో తమిళ డైలాగ్స్ ఈజీగా చెప్పేస్తున్నట్లు, తమిళ డబ్బింగ్ కూడా స్వయంగా మహేషే చెబుతాడని మురుగదాస్ తెలపడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఓ సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకీక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్గా నటిస్తోండగా, ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్గా నటిస్తున్నారు. హరీస్ జైరాజ్, సంతోష్ శివన్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తోన్న ఈ సినిమాను ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.