గతంలో 'యువ', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి చిత్రాలలో సిద్ధార్థ్ తో జతకట్టిన త్రిష ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అతనితో రొమాన్స్ చేయడానికి ఓకే చెప్పేసింది. 'అరణ్మనై' చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుందర్ సి ఇప్పుడు సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు, అందులో త్రిషను కథానాయికగా ఎంచుకున్నట్టు వార్తలొచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో హీరోగా సిద్ధార్థ్ ను ఎంపిక చేసుకున్నారు. దీంతో ఈ జంట మూడోసారి వెండితెరకు వస్తోంది. ఇదిలా ఉంచితే, వరుణ్ మణియన్ తో తన బంధం బ్రేక్ అవడంతో త్రిష వరుసగా సినిమాలు ఒప్పుకుంటోంది.
trisha, sidharatha, news, 3rdtime, kollywood,