Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-May-2016 11:43:34
facebook Twitter Googleplus
Photo

ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మీద అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలతో ఓ అనవసర వివాదం చుట్టుముట్టింది అల్లు ఫ్యామిలీని. తాజాగా మరో కాంట్రవర్శీతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతున్నాడు అల్లు అరవింద్. ఈసారి ఆయన మీద అటాక్ చేస్తోంది పవన్ ఫ్యాన్స్ కాదు.. మహేష్ బాబు అభిమానులు కావడం విశేషం. ఇప్పుడు కొత్తగా వాళ్లతో వైరం ఏంటి అంటే.. తన కొడుకు సినిమా ?సరైనోడు? కోసమని ఉత్తరాంధ్రలో థియేటర్లను బ్లాక్ చేసి పెట్టారట అరవింద్. దీంతో ?బ్రహ్మోత్సవం? సినిమాకు అక్కడ సరిపడా థియేటర్లు దొరకట్లేదట.

దీంతో ?చీప్ అల్లు పాలిటిక్స్? అనే నెగెటివ్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ అరవింద్ మీద విరుచుకుపడుతున్నారు మహేష్ అభిమానులు. థియేటర్ల బ్లాకింగ్ విషయంలో వాస్తవాలేంటో తెలియాల్సి ఉంది కానీ.. మహేష్ అభిమానులు మాత్రం అరవింద్ మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మామూలుగా ఇలాంటి నెగెటివ్ ట్యాగ్ ల ట్రెండింగ్స్ కోలీవుడ్లోనే ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య టాలీవుడ్లోనూ ఈ సంస్కృతి పెరుగుతోంది.

ఆల్రెడీ అల్లు అర్జున్ మాటను పట్టుకుని ?చెప్పను బ్రదర్? అనే హ్యాష్ ట్యాగ్ తో రచ్చ చేశారు పవన్ ఫ్యాన్స్. ఇప్పడు మహేష్ ఫ్యాన్స్ ఓ అడుగు ముందుకేశారు. మొత్తానికి ?సరైనోడు సక్సెస్ ఆనందంలో ఉన్న సమయంలో ఈ లేని పోని వివాదాలేంటో అర్థం కావట్లేదు అల్లు ఫ్యామిలీకి.

,  ,  ,  ,  ,