ఒక హీరో కోసం.. ఇంకో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం అరుదు. ఐతే తనకు లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే ?అతడు? సినిమా ఇచ్చాడన్న కృతజ్నతతో త్రివిక్రమ్ కోసం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ?జల్సా? సినిమాకు గొంతు అరువిచ్చాడు మహేష్. ఆ సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత శ్రీను వైట్ల కూడా తనకు ?దూకుడు? లాంటి మెమొరబుల్ మూవీ ఇచ్చాడని.. అతడి ?బాద్ షా? సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు మహేష్. ఇప్పుడు మరో దర్శకుడి రుణం తీర్చుకునే క్రమంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కోసం రెండోసారి తన గొంతును అరువిస్తున్నాడట మహేష్ బాబు.
మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ?శ్రీమంతుడు? చిత్ర దర్శకుడు కొరటాల శివ.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ?జనతా గ్యారేజ్? సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మహేష్ తో వాయిస్ ఓవర్ ఇప్పించాలని కొరటాల భావించాడట. మహేష్ కూడా అందుకు ఒప్పుకున్నాడట. ఇప్పటికే ?జనతా గ్యారేజ్?లో అనేక ఆకర్షణలున్నాయి. మహేష్ వాయిస్ ఓవర్ వార్త కూడా నిజమైతే అది కూడా సినిమాకు మరో హైలైట్ గా నిలిచే అవకాశముంది. ఇప్పటికే దాదాపు 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది ?జనతా గ్యారేజ్?. ఇంకో రెండు నెలల్లో టాకీ పార్ట్ అంతా పూర్తయిపోతుందని సమాచారం. మోహన్ లాల్.. సమంత.. నిత్యామీనన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.