తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ త్రిభాషా నటిగా పేరు తెచ్చుకున్న శ్రుతి హాసన్ జోరు పెంచుతోంది. తమిళంలో కూడా మరిన్ని సినిమాలు చేయాలని డిసైడ్ అయింది. ఇప్పటికే అజిత్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్న ఈ సౌందర్యరాశి, త్వరలో సూర్యాతో కూడా జత కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. హరి దర్శకత్వంలో సూర్య హీరోగా 'సింగం 3' చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'సింగం', 'సింగం 2' సినిమాలలో అనుష్క కథానాయికగా నటించింది. ఇందులో కూడా ప్రధాన కథానాయికగా తనే నటిస్తుంది. అయితే, మరో కథానాయిక పాత్రకు మాత్రం శ్రుతిహాసన్ ని తీసుకుంటున్నారు. ఈ విషయమై ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు కోలీవుడ్ సమాచారం.
surya, hari, singham3, anushka, shrutihasan,