న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి టాలీవుడ్ ప్రముఖులు అప్పుడే ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలసి అబుదాబి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రత ఓ మీడియా సంస్థకు వెల్లడించింది. "గత కొన్నాళ్లుగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి UAE మా ఫేవరైట్ లొకేషన్ అయిపోయింది. అందుకే, ఈ ఏడాది కూడా అబుదాబి ప్లాన్ చేసుకున్నాం. మా పిల్లలు చిన్న వాళ్లు కాబట్టి జెట్ లాగ్ లేకుండా వుండడం కోసం దగ్గరలో వున్న సౌకర్యవంతమైన దేశానికి వెళుతున్నాం. ఆ విధంగా అబుదాబి మాకు బాగా నచ్చింది" అని చెప్పింది. ఈసారి మహేష్ తన పిల్లలతో కలసి అక్కడి డిజర్ట్ ప్రాంతంలో కేమెల్ రైడ్ (ఒంటెలపై సవారీ), ఫ్యాట్ బైకింగ్ రైడ్ కి వెళతాడట!
maheshbabu, namratha, newyearcelebrations, abudhabi,