సూపర్ స్టార్ మహేష్ కొద్దిరోజులుగా కుటుంబంతో కలిసి లండన్లో సెలవులను గడుపుతోన్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటించిన ?బ్రహ్మోత్సవం? ఈమధ్యే విడుదలై, ప్రేక్షకుల దగ్గర్నుంచి ఆశించినంత ఆదరణ తెచ్చుకోకపోవడంతో, కొన్నాళ్ళపాటు ప్రొఫెషనల్ లైఫ్కు బ్రేక్ ఇచ్చి కుటుంబంతో కలిసి విశ్రాంతి కోసం మహేష్ లండన్ వెళ్ళిపోయారు. ఇక అక్కడే మూడు వారాలుగా భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో పలు అందమైన ప్రదేశాల్లో సెలవులను గడుపుతూ వచ్చిన మహేష్ రేపు ఇండియాకు తిరుగు ప్రయాణం కానున్నారు.
16వ తేదీ సాయంత్రం కల్లా మహేష్ హైద్రాబాద్కు చేరుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇక్కడికి వచ్చేశాక మురుగదాస్ దర్శకత్వంలో తాను నటించబోయే సినిమా కోసం మహేష్ సిద్ధం కానున్నారు. ఈసారి ఎలాగైన బలమైన హిట్ కొట్టాలన్న ఆలోచనతో మురుగదాస్ సినిమా కోసం మహేష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. జూలై నెలలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్ళనుంది.