సౌతిండియన్ సినిమా అవార్డు వేడుకల విషయానికి వస్తే, సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)కు ఓ ప్రత్యేకత ఉంది. 2012లో మొదటిసారి మొదలైన ఈ అవార్డులు, విదేశాల్లో ఇక్కడి తారల సందడితో అత్యద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఇక తాజాగా 2015 సంవత్సరానికి సంబంధించిన అవార్డు వేడుకలు సింగపూర్లో జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం జరిగిన వేడుకలో తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు.
ఇక తెలుగు అవార్డుల విషయానికి వస్తే, ఉత్తమ చిత్రంగా ?బాహుబలి? ఎంపిక కాగా, ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక ?శ్రీమంతుడు? సినిమాకు గానూ సూపర్ స్టార్ మహేష్ ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకూ 5 సైమా అవార్డు వేడుకలు జరగ్గా, మహేష్ ఇందులో మూడు అవార్డులను సొంతం చేసుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. నేడు తమిళ, మళయాల సినీ పరిశ్రమలకు సంబంధించిన అవార్డు ప్రదానోత్సవం జరగనుంది.