విలక్షణ నటుడుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మోహన్ బాబు ఏడాదిన్నరకు పైగా యాక్టింగ్ కు దూరంగా ఉన్నారు. ఆయనకు తగిన స్క్రిప్ట్ లభించకపోవడం ఇందుకు కారణంగా చెప్పచ్చు. 560 సినిమాలకు పైగా నటించిన ఓ నటుడు.. రెండేళ్ల పాటు కెమేరాకు దూరంగా ఉండడం ఆశ్చర్యకరమే.
అయితే.. ఇప్పుడు వరుసగా సినిమా చేసేందుకు మోహన్ బాబు సిద్ధమవుతున్నారు. హీరో ధనుష్ దర్శకత్వంలో రూపొందిన తమిళ్ హిట్ మూవీ పా పాండీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని చూస్తుండగా.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పుడు మరో కొత్త చిత్రానికి మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. పెళ్లైన కొత్తలో వంటి హిట్ చిత్రాన్ని తీసిన దర్శకుడు మదన్ తో మోహన్ బాబు సినిమా చేయనున్నారు. ఇప్పటికే మదన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది.
మోహన్ బాబు వయసుకు తగినట్లుగా.. ఆయనకు మాత్రమే సెట్ అయ్యే ఓ కీలక పాత్రతో రత్నబాబు ఓ స్టోరీ లైన్ చెప్పాడట. ఈ ప్రాజెక్టుకు కూడా మోహన్ బాబు ఓకే చెప్పేయడంతో.. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరిగిపోతున్నాయి.