అధినేత?,? ఏమైంది ఈవేళ?, ?బెంగాల్ టైగర్? తదితర చిత్రాలను నిర్మించిన కేకే రాధామోహన్ తాజాగా నవీన్చంద్ర హీరోగా ఓ చిత్రం నిర్మించనున్నారు. ?ఓ చినదాన?, ?తిరుమల తిరుపతి వెంకటేశ?, ?యముడికి మొగుడు? వంటి చిత్రాలను తెరకెక్కించిన ఇ.సత్తిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. నిర్మాత మాట్లాడుతూ - ??పూర్తి వినోదాత్మక చిత్రమిది. ప్రేక్షకులకు వంద శాతం నవ్వులు పంచుతుంది. సత్తిబాబు ఈ కథను బాగా హ్యాండిల్ చేస్తారనే నమ్మకం ఉంది?? అన్నారు.
నితిన్ హీరోగా భారీ చిత్రం
ఇదే బ్యానర్లో నితిన్ హీరోగా రాధాకృష్ణ నిర్మించనున్న భారీ చిత్రం డిసెంబర్లో ప్రారంభమవుతుంది.