రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా వున్న తాజా టాలీవుడ్ సోయగం రకుల్ ప్రీత్ సింగ్ పై నితిన్ మనసు పడ్డాడు. తన తదుపరి చిత్రానికి కథానాయికగా ఆమెను బుక్ చేయమని అడుగుతున్నాడట. మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడితో నితిన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జూన్ లో మొదలవుతుంది. ఇప్పుడీ సినిమా కోసమే రకుల్ ని ట్రై చేస్తున్నారు. గతంలో ఓ సినిమాకు సంబంధించి రకుల్ కి నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి అడ్వాన్సు ఇచ్చారట. ఆ సినిమా ఆగిపోయినా, అడ్వాన్సు వెనక్కి తీసుకోలేదని, అందువల్ల ఆ డేట్స్ దీనికి కేటాయించమని అడుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఊపిరిసలపనంతగా బిజీగా వున్న ఈ సుందరి నితిన్ కి డేట్స్ సద్దుబాటు చేయగలదా?
nithin, rakulpreet, news, mallidivenu, news,