Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jan-2017 13:33:23
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్లో ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కశ్యప్. ఇక ?తను వెడ్స్ మను? సిరీస్.. రాన్ జానా లాంటి సినిమాలతో ఆనంద్ ఎల్.రాయ్ కూడా మంచి పేరే తెచ్చుకున్నాడు. ఇక ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకున్న గుర్తింపూ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు దర్శకులు.. ఈరోస్ వాళ్లు కలిసి ఓ మలయాళం సినిమాలో నిర్మాణ భాగస్వాములుగా మారడం విశేషం. ?ప్రేమమ్? సినిమాతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న యంగ్ హీరో నివిన్ పౌలీ ఈ సినిమకు కథానాయకుడు. ఆ సినిమా పేరు.. మూతాన్.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తేనే జనాలకు దిమ్మదిరిగిపోతోంది. గ్లామర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న నివిన్ పౌలీ.. భయంకరమైన అవతారంలోకి మారిపోయాడు ఈ సినిమా కోసం. ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ఆలస్యం.. ఈ సినిమా మీద హైప్ పెరిగిపోయింది. పైగా అంతమంది బాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాలో భాగస్వాములవుతుండటంతో హైప్ మరింత పెరిగింది. ఈ చిత్రాన్ని ఒకప్పటి నటి.. ఈ మధ్యే దర్శకురాలిగా మారిన గీతు మోహన్ దాస్ రూపొందించనుంది. రెండేళ్ల కిందట ఆమె హిందీలో తీసిన ?లయర్స్ డైస్? సినిమా అనేక అవార్డులు సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆ సినిమాలో గీతు ప్రతిభ చూసి.. అనురాగ్.. ఆనంద్ ?మూతాన్?లో భాగస్వాములయ్యారు. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజవుతుంది.

,  ,  ,  ,  ,