Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Dec-2017 10:46:39
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ విలక్షణ దర్శకుడు త్రివిక్రమ్ ల కాంబోలో తెరకెక్కిన అజ్ఞాతవాసి ఆడియో వేడుక ఈ నెల19న హైదరాబాద్ లో జరగబోతోన్న సంగతి తెలిసిందే. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. హైదరాబాద్ లోని హెచ్.ఐ.సి.సి నోవాటెల్ లో ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయట. సాధ్యమైనంత తక్కువ సమయంలో ఈ కార్యక్రామాన్ని ముగించాలని పవన్ - త్రివిక్రమ్ లు భావిస్తున్నారట. అయితే ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారనే విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణ కానున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రామానికి ఇద్దరు స్టార్ హీరోలు రాబోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విక్టరీ వెంకటేష్ - జూనియర్ ఎన్టీఆర్ లు హాజరుకాబోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. అజ్ఞాతవాసి లో అతిథి పాత్ర పోషించిన విక్టరీ వెంకటేష్ ...ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని తెలుస్తోంది. వెంకీతో పాటు త్రివిక్రమ్ తో తర్వాతి సినిమా చేయబోతోన్న ఎన్టీఆర్ ఈ వేడుకలో సందడి చేయనున్నాడట. అయితే ఈ వేడుకకు అజ్ఞాతవాసి యూనిట్ సభ్యులు మాత్రమే రాబోతున్నారని వేరే అతిథులెవర్నీ పిలవడం లేదని మరో పుకారు బలంగా వినిపిస్తోంది. కేవలం పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ లే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులని తెలుస్తోంది. అంతేకాకుండా చాలా సింపుల్ గా తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమాన్ని ముగించాలని పవన్ - త్రివిక్రమ్ లు ప్లాన్ చేస్తున్నారట.

,  ,  ,  ,  ,  ,  ,