యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న జనతా గ్యారెజ్ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న విషయం తెలిసిందే. ఈనెల 12న దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన ఆడియోను పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ?జనతా గ్యారెజ్? టీమ్ ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటోంది. ఇక అదే రోజున థియేట్రికల్ ట్రైలర్ను కూడా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఈ ట్రైలర్కు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో పడిపోయారు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ ట్రైలర్కు సంబంధించిన తన డబ్బింగ్ పనులను నేడు పూర్తి చేశారు.
ఫస్ట్ టీజర్ తరహాలోనే ఈ ట్రైలర్లోనూ కొరటాల శివ మార్క్ డైలాగ్స్ అదిరిపోయేలా ఉన్నాయని సమాచారం. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా దూసుకుపోతోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా పక్కాగా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.