ఇప్పుడు ఓ మూడు టాలీవుడ్ సినిమాల బిజినెస్ గురించి మీడియా అంతా తెగ హంగామా జరిగిపోతోంది. మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్.. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ.. ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఆశ్చర్యకరమైన ఫిగర్స్ చెబుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పవన్ మూవీకి నిర్మాతలు 95 కోట్లు అడుగుతున్నారని.. అలాగే మహేష్ స్పైడర్ కు 77 కోట్లు.. ఎన్టీఆర్ జై లవ కుశకు 69 కోట్లు నిర్మాతలు కోట్ చేస్తున్నారనే టాక్ ఉంది. అయితే.. నిర్మాతలు ఎంతలేసి అడిగినా.. ఇంత మొత్తానికి అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదని తెలుస్తోంది. భారీ మొత్తాన్ని పెట్టుబడి చేయడంలో తాము చాలా అప్రమత్తంగా ఉన్నట్లు చెబుతున్నారు డిస్ట్రిబ్యూటర్స్. బాహుబలి2కి భారీ బిజినెస్ జరిగినంత మాత్రాన.. తర్వాత వచ్చే సినిమాలు ఈ స్థాయిలో బిజినెస్ చేయడం.. వసూళ్లు సాధించడం సులభమేమీ కాదన్నది డిస్ట్రిబ్యూటర్స్ వాదన.
ప్రస్తుతం వినిపిస్తున్న ఫిగర్స్ అన్నీ ఊహాజనితమే తప్ప.. ఇప్పటివరకూ ఎక్కడా బిజినెస్ క్లోజ్ కాలేదని తెలుస్తోంది. నిర్మాతలు అడిగే మొత్తానికి.. డీల్ ఫైనల్ అయ్యే మొత్తానికి మధ్య చాలానే వేరియేషన్ ఉండచ్చు.