శరత్ మరార్.. సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కు అత్యంత ఆప్తుడైన మిత్రుడు. ఒకరకంగా చెప్పాలంటే త్రివిక్రమ్ కంటే పవన్ కు శరత్ క్లోజ్. త్రివిక్రమ్ తన సినిమాల వ్యవహారాల్లో పడి ఎప్పుడో కానీ పవన్ ను కలవడు. కానీ శరత్ మాత్రం ఎప్పుడూ పవన్ తోనే ఉంటాడు. అందుకే తన మిత్రుడితో వరుసగా రెండు సినిమాలు చేశాడు పవన్. గోపాల గోపాల.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు చివరికి ఎలాంటి ఫలితాన్నందుకున్నప్పటికీ శరత్ మాత్రం ఆర్థికంగా మంచి ఫలితాలే అందుకున్నాడు. రెండు సినిమాలకూ మంచి బిజినెస్ జరిగింది. ముఖ్యంగా ?సర్దార్ గబ్బర్ సింగ్? శరత్ కు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఐతే ఈ సినిమా ద్వారా బయ్యర్లు భారీగా నష్టాల పాలయ్యేలా కనిపిస్తుండటంతో వాళ్లందరూ కలిసి సాయం కోసం పవన్ ను కలవబోతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో బయ్యర్లను ఆదుకోవడానికి పవన్ మళ్లీ ఓ సినిమా చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ఇది తన మిత్రుడు శరత్ నిర్మాణంలోనే కావచ్చు. ఐతే ఈసారి లాభాల కోసం ఆశించకుండా బయ్యర్లను ఆదుకోవడమే లక్ష్యంగా సినిమా చేస్తారట. ?సర్దార్? నష్టాలు కవర్ చేసేలా తక్కువ మొత్తాలకు అదే బయ్యర్లకు సినిమాను అమ్మాలన్నది ప్రణాళిక. అలా అనుకోకుండా పవన్ తో వరుసగా మూడో సినిమా చేసే అవకాశం రాబోతోంది శరత్ కు. ఎస్.జె.సూర్య తయారు చేస్తున్న స్క్రిప్టుతో చేయబోయేది ఈ సినిమానే అంటున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక-హాసిని క్రియేషన్స్ బేనర్లో పవన్ సినిమా పట్టాలెక్కొచ్చని సమాచారం. ఆ తర్వాత దాసరి నారాయణరావు నిర్మాణంలో సినిమా తెరమీదికి రావచ్చు.