మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ.. కాస్త ఆలస్యమైన అదిరిపోయే రేంజ్ రెడీ అయిపోతోంది. నిజానికి ఇపాటికే సినిమా షూటింగ్ గట్రా అయిపోయి రిలీజ్ కూడా అవాల్సింది కానీ.. అనుకోని ఆలస్యం కారణంగా ఇంకా సెట్స్ పైనే ఉండాల్సొచ్చింది. కానీ నవంబర్ రెండో వారానికల్లా ధృవ షూటింగ్ పూర్తి చేసేయాలనే టార్గెట్ తో యూనిట్ బాగా హుషారుగా పని చేసేస్తున్నారు.
డిసెంబర్ 2న రామ్ చరణ్ ధృవను రిలీజ్ చేయాలన్నది దర్శక నిర్మాతల ఆలోచన. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోయినా.. ఇప్పటికే డెసిషన్ అయితే అయిపోయింది. నవంబర్ 15నాటికి పనులన్నీ ఫినిష్ చేసేసి.. నవంబర్ 20న గ్రాండ్ గా ధృవ ఆడియో ఫంక్షన్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. చెర్రీ ఎన్నో సార్లు బాబాయిపై తన ప్రేమను ఓపెన్ గానే చెప్పాడు. వీళ్లిద్దరి మధ్య అనుబంధం బోలెడంత ఉందని ఇండస్ట్రీలో కూడా అంటారు. కానీ.. ఇద్దరూ కలిసి తమ అఫెక్షన్ ని ఎప్పుడూ పైకి చూపలేదు.
ఆ ఒక్కటీ పెండింగ్ అని పవన్ భావించనట్లు ఉన్నాడు. అందుకే అబ్బాయ్ ఆడియో వేడుకకు వచ్చేందుకు ఈ బాబాయ్ అంగీకారం చెప్పేశాడని అంటున్నారు. ఈసారైనా మెగా ఫంక్షన్ కు పవన్ వస్తాడనే కబురు నిజం అవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.