గబ్బర్సింగ్, అత్తారింటికి దారేది వంటి సక్సెస్ లతో ఫుల్ జోష్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఇతడే అనుకున్న అబిమానులకు సర్దార్ గబ్బర్ సింగ్ తో షాక్ తగిలింది. అంతే కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మరో రెండు, మూడు సినిమాలు తప్ప చేయనని ప్రకటన చేస్తుండడం తో అబిమనుల్లో ఈ రెండు మూడు సినిమాలు అయిన బ్లాక్ బస్టర్ హిట్స్ అవడం కాదు టాలీవుడ్ నెంబర్ వన్ పవన్ కావాలని కోరుకుంటున్నారు.
కానీ పవన్ తన తదుపరి చిత్రాన్ని కొమరం పులి దర్శకుడితోనే చేయాలని ఫిక్స్ అయిపోయాడు. దీంతో ఎస్.జె. సూర్య ఎక్కడ పవన్ కు మరో డిజాస్టర్ ఎస్తాడో అని ఫాన్స్ గజగజలాడుతున్నారు. జల్సా , అత్తారింటికి దారేది వంటి మెగా హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ తో చేస్తేనే బాగుందని అబిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియా లో అయితే కొందరు అబిమానులు ఏదోటి జరిగి ఎస్జె సూర్యతో సినిమా ఆగిపోవాలని అంటున్నారు. అంతే కాదు త్రివిక్రమ్ తో వెంటనే సినిమా స్టార్ట్ చేయాలనీ పూజలు చేస్తున్నారు..మరి వారి పూజలు చూసి పవన్ దేవుడు కరునిస్తాడో లేదో చూడాలి.