సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే సినిమా దర్శకులు ఒక్కోసారి బాద్యతయుతంగా కొన్ని మంచి కార్యక్రమాలకోసం వారి టాలెంట్ ను కూడా చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం మన తెలుగు దర్శకులు కూడా అదే తరహాలో ఒక మంచి కార్యక్రమం కోసం వారి అసలైన టాలెంట్ ను చూపించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారు.
విషయానికి వస్తే.. డిసెంబర్ 15న హైదరాబాద్ లో తెలుగు మహా సభలు ప్రారంభం కానున్నాయి. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేస్తోంది. ఈ వేడుకల కోసం మన దర్శకులు కొంతమంది వారి దర్శకత్వ ప్రతిభను ఉపాయోగించి సాంగ్స్ ని డైరెక్ట్ చేయబోతున్నారు. హరీష్ శంకర్ తన స్టైల్ లో ఒక సాంగ్ ని డైరెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి కూడా తనదైన శైలిలో తెలుగు మహా సభల కోసం ఒక సాంగ్ ని క్రియేట్ చేయబోతున్నారు. వారితో పాటు వంశీ పైడిపల్లి లేడి డైరెక్టర్ నందిని రెడ్డి కూడా వారి తరహాలో పాటలను డైరెక్ట్ చేస్తున్నారని టాక్.
మొత్తానికి దర్శకులు వారి టాలెంట్ ని ఒక మంచి కార్యక్రమంలో చూపించబోతున్నారు. వేడుకకు ప్రముఖ సాహితీవేత్తలు ముఖ్య అతిధులుగా రాబోతున్నారు